* ఘనంగా "వీక్షణం" సినిమా టీజర్ విడుదల, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ* రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "వీక్షణం". ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవోపీ సాయిరామ్ మాట్లాడుతూ - వీక్షణం సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అలాగే మా హీరో హీరోయిన్స్ రామ్ కార్తీక్, కశ్వి అందంగా స్క్రీన్ మీద కనిపిస్తారు. వాళ్లు ఫెయిర్ గా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద అందంగా చూపించేందుకు నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చే ఛాన్స్ దొరికింది. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ - ఈ రోజు వీక్షణం టీజర్ లాంఛ్ ఈవెంట్
we give exclusive cinema news and all major political news also