ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డియర్ ఉమ రివ్యూ.. గొప్ప సందేశాన్నిచ్చే చిత్రం


 డియర్ ఉమ రివ్యూ.. గొప్ప సందేశాన్నిచ్చే చిత్రం


ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలని ఉమా (సుమయ రెడ్డి) పల్లెటూరు నుంచి సిటీకి వస్తుంది. ఆయుష్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. మరోవైపు దేవ్ (పృథ్వీ అంబర్) రాక్ స్టార్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రేమలో విఫలం అవ్వడంతో తాగుడుకు బానిసై దేని మీదా కాన్సర్టేట్ చేయలేక పోతాడు. దేవ్ చెడిపోతోన్నాడని ఆగ్రహం వ్యక్తి చేసి అతని తండ్రి ఇంట్లోంచి గెంటేస్తాడు. అక్కడా ఇక్కడా కష్టపడుతున్న దేవ్‌కి ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో గుండెకు గాయం అవుతుంది. ఉమ చదువుతున్న ఆయుష్ హాస్పిటల్లోనే దేవ్‌ని జాయిన్ చేస్తారు. అదే హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌గా ఉమ పనిచేస్తుంది. అక్కడే దేవ్ అన్నయ్య సూర్య (కమల్ కామరాజ్) కూడా అడ్మినేస్ట్రటర్ కూడా పని చేస్తాడు. అయితే ఆ హాస్పిటల్ నుంచి దేవ్ డిశ్చార్జ్ అయిన తరువాత ఆర్ట్ గ్యాలరీలో పని చేస్తుంటాడు. ఆ టైంలోనే ఉమతో దేవ్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఉమతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత దేవ్ ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. దేవ్ తెలుసుకున్న నిజం ఏంటి?.. అసలు ఉమకి ఏమైంది?.. ఉమ కోసం దేవ్ ఏం చేశాడు? అన్నది కథ.


ఉమ పాత్రలో సుమయ రెడ్డి చక్కగా నటించింది. ఇక నిర్మాతగా, రచయితగా, నటిగా సుమయ రెడ్డి తన వంతు న్యాయం చేసింది. అందరినీ కదిలించే, అవగాహన కల్పించే, మేల్కొపే కథను రాయడంలో సుమయ సక్సెస్ అయింది. ఎమోషన్స్ పలికించడంలో, తెరపై అందంగా కనిపించడంలోనూ సుమయ రెడ్డి తన మార్క్ వేసింది. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ యాక్టింగ్ బాగుంటుంది. అజయ్ ఘోష్ పాత్ర మెప్పిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.


"డియర్ ఉమర్" సినిమా చూసిన తర్వాత వైద్య రంగంపై ఒక రకమైన ఆలోచన కలుగుతుంది. సినిమాలో చూపించిన అన్యాయాలు నిజంగా కలచివేసేలా ఉన్నాయి. సాయి రాజేష్ ఈ కథను చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. రధన్ సంగీతం సినిమా యొక్క భావోద్వేగాలను మరింత పెంచింది. రాజ్ తోట కెమెరా పనితనం చాలా సహజంగా అనిపించింది, సినిమా చూస్తున్నంతసేపు ఒక నిజమైన ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే అద్భుతం! ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్ నన్ను షాక్‌కు గురిచేశాయి. క్లైమాక్స్‌లోని పాట సినిమా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సినిమా చూసిన తర్వాత ఒక మంచి సందేశాన్ని అందుకున్నాననే భావన కలిగింది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇక సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మాతగా తొలి ప్రాజెక్టునే గొప్పగా నిర్మించి సుమయ రెడ్డి సక్సెస్ అయిందని చెప్పొచ్చు.



రేటింగ్ : 3/5

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...