ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

*ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల‌*





 *ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల‌*


హైద‌రాబాద్: 

తెలుగు వెండితెర‌పై మ‌రో భ‌క్తిర‌స చిత్రం క‌నువిందు చేయ‌బోతోంది. అనంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో, నర్సింగ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం "శివ శంభో". తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. 

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్, ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ డా. త‌నికెళ్ల భ‌ర‌ణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు. ఇలాంటి భ‌క్తిర‌స చిత్రాలు చాలా అరుదుగా వ‌స్తాయి. భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించగలరనే  విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్ మాట్లాడుతూ.. "నర్సింగ్ రావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్లో నిలిచిపోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తెలుగు చిత్ర‌సీమ‌లో ఇది చెప్పుకోద‌గ్గ సినిమాగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను". అని అన్నారు.

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. "సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ అరుదైన సినిమాను మ‌నమంతా గౌర‌వించాలి. ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి  పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు". అని అన్నారు.. 

చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ.. "ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌కు వెళ్లి చూసి సినిమాను ఆద‌రించాల‌ని కోరుతున్నాము. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రూ అభినందిస్తున్నారు." అని అన్నారు.

దర్శకుడు నర్సింగ్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమా ను నిర్మించామని, తప్పకుండా మంచి స్పందన వస్తుందని తెల్పుతూ, చిత్ర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

   కార్యక్రమం చివర స్వామీజీ ఆశీఃప్రసంగం చేసి, అందరికీ జ్ఞాపికలు బహూకరించారు.

బ్యానర్ :అనంత ఆర్ట్స్ 

నిర్మాతలు: బొజ్జ రాజ గోపాల్, సుగుణ దోరవేటి.

డైరెక్టర్: నర్సింగ్ రావు 

డిఓపి: కారె సతీశ్ కుమార్ 

హీరో హీరోయిన్: కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి,కేశవర్థిని బేబీ రిషిత.

పాటలు మాటలు, సంగీతం: దోరవేటి 

ముఖ్యపాత్రలో: తనికెళ్ళ భరణి, సుమన్, టార్జాన్, విజయ్ రంగరాజన్, చిల్లర వేణు, రామస్వామి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి,  రమేష్ యాదవ్, శ్రీకర్, విగ్నేష్ తదితరులు నటించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...