ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ*







 *రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ*

శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్  అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ శింబు అందించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న రీ రిలీజ్ చేశారు.

సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక ముఖ్య పాత్రల్లో నటించారు.


ఈ మధ్యకాలంలో రీ రిలీజులకు ఉన్న ట్రెండ్ ఏంటో మనందరం చూస్తున్నాం. ప్రస్తుత రిలీజ్ లకు దీటుగా రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఈనెల 5న రీ రిలీజ్ అయిన మన్మధ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. శింబు, జ్యోతిక క్రేజ్ మామూలుగా లేదు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. జనరేషన్ తో సంబంధం లేకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా అప్పటి సినిమాల్ని కూడా ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా చూస్తున్నారు ఆడియన్స్. రీ రిలీజ్ లో కూడా ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకి శింబు అభిమానులకి, జ్యోతిక అభిమానులకి, యంగ్ మాస్ట్రో యువ శంకర్ రాజా అభిమానులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.


నటీనటులు :

శింబు, జ్యోతిక, సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక తదితరులు


టెక్నీషియన్స్ :

సినిమాటోగ్రఫీ : ఆర్. డి. రాజశేఖర్

సంగీతం : యువన్ శంకర్ రాజా

కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ : శింబు

దర్శకత్వం : ఏ. జే. మురుగన్

ప్రపంచవ్యాప్త పంపిణీదారులు : సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

పి ఆర్ ఓ : మధు VR

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.