ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం





 హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం


గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున ఉన్న లాయర్ నాగూర్ బాబు మరియు ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు అదే విధంగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసులు వివరాలను తెలియజేశారు.


లాయర్ నాగూర్ బాబు గారు మాట్లాడుతూ : ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్లు కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయిన తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టాగ్రామ్ పేజెస్ ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాధితురాలు పైన లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మీడియా ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా వాటిని ఎంటర్టైన్ చేస్తూ బాధితురాలని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై మేము హైకోర్టును ఆశ్రయించాం. కానీ వాస్తవికంగా మీడియా చాలా సపోర్ట్ చేస్తూ అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా చేస్తున్న మోసాలను బయటపెట్టారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారు డిలీట్ చేయవలసిందిగా ధర్మాసనం నుంచి ఇంటెరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాము. అదే విధంగా ఎఫ్ఐఆర్లో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది వాదనలకు దిగి ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో బాధితురాలని మానసికంగా బాధ పెడుతున్నారు. అలా చేస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అలా నిజా నిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బి ఎన్ ఎస్ కింద కేసులు నమోదు చేసాం. బాధితురాలు పేరు ఎక్కడ కూడా నిజనిర్ధారణ జరిగే వరకు తీయకుండా న్యాయస్థానం నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాం"  అన్నారు.


నిర్మాత బాలచంద్ర గారు మాట్లాడుతూ : బాధితురాలు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో ఎంత మానసిక బాధకి గురి చేస్తున్నారు కూడా చూస్తున్నాం. కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్ష సాయి ఇబ్బంది పెడుతున్నాడు. దానికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మాకు అనుకూలంగా తీర్పు లభించింది. ఈ వార్తని మీడియాతో పంచుకోవాలని అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని నిజా నిజాలు తెలియకుండా ఎవరు ఎక్కడ చూపించరాదని న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేసింది"  అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.