ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఘనంగా "వీక్షణం" సినిమా టీజర్ విడుదల, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*





 *ఘనంగా "వీక్షణం" సినిమా టీజర్ విడుదల, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "వీక్షణం".  ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ సాయిరామ్ మాట్లాడుతూ - వీక్షణం సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అలాగే మా హీరో హీరోయిన్స్ రామ్ కార్తీక్, కశ్వి అందంగా స్క్రీన్ మీద కనిపిస్తారు. వాళ్లు ఫెయిర్ గా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద అందంగా చూపించేందుకు నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చే ఛాన్స్ దొరికింది. అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ - ఈ రోజు వీక్షణం టీజర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మీరు టీజర్ లో చూసింది కొంతే. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీని ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం డైరెక్టర్ మనోజ్ గారు ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత పి.పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - మా వీక్షణం సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి కృతజ్ఞతలు. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈనెల 18న థియేటర్స్ లోకి వస్తున్న మూవీని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ గా వీక్షణం సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ - వీక్షణం సినిమా టీజర్ లాంఛ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి కృతజ్ఞతలు. మా మూవీ టీజర్ మీకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా మిమ్మల్ని ఎంగేజ్  చేసే చిత్రమిది. ఫన్, లవ్, సస్పెన్స్, మిస్టరీ వంటి అన్ని ఎలిమెంట్స్ మా సినిమాలో ఆకట్టుకుంటాయి. అన్నారు.

హీరోయిన్ కశ్వి మాట్లాడుతూ - ఈ రోజు మా ఈవెంట్ కు వచ్చి మీ విలువైన సమయం వెచ్చించిన ప్రతి ఒక్కరికీ మా టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ మనోజ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులు మా వీక్షణం సినిమాకు వచ్చేయండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఈ నెల 18న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ - నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశాను. ఒకరోజు విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం. ఆయన చెప్పిన ఆ మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం. మా చిత్రంలో హీరో ఎప్పుడూ పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుందో చూడాలనే ఉత్సాహంలో ఉంటాడు. ఆ ఉత్సాహం వల్ల అతనికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. మా టీమ్ అంతా కష్టపడి కాకుండా ఇష్టపడి మూవీ కోసం వర్క్ చేశాం. ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన భరద్వాజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి. టీజర్ లాంఛ్ రోజే చెబుతున్నా, మేము తప్పకుండా సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. ఆ రోజు మళ్లీ మీ అందరినీ కలుస్తాము. అన్నారు.

అతిథిగా వచ్చిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి మాట్లాడుతూ - వీక్షణం సినిమా టీజర్ బాగుంది. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్ల టీజర్ తో తెలుస్తోంది. ఆదిత్య మ్యూజిక్ వాళ్లు హిట్ సినిమాలను మాత్రమే మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నారు. వీక్షణం సినిమా వాళ్లు తీసుకున్నారంటే హిట్ అయినట్లే. హీరో రామ్ కార్తీక్, కశ్వి జంట తెరపై బాగుంది. దర్శకుడు మనోజ్ పల్లేటితో పాటు టీమ్ అందరికీ సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ - మా వీక్షణం మూవీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. మా సినిమా టీమ్ లో సురేష్ కొండేటి గారు జాయిన్ అయ్యాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మూవీ తప్పకుండా అందరికీ రీచ్ అవుతుందని నమ్మకం మొదలైంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మంచి మూవీకి తన సపోర్ట్ అందిస్తారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయన మా టీజర్ లాంఛ్ కు రావడం సంతోషంగా ఉంది. వీక్షణం సినిమా ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమలోనూ మా అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు డీవోపీ సాయి, డైరెక్టర్ మనోజ్ రెండు కళ్లలాంటి వారు. ఇలాంటి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇచ్చినందుకు డైరెక్టర్ మనోజ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన రెండు పాటలకు రెస్పాన్స్ బాగుంది. టీజర్ కూడా మీ అందరి ఆదరణ పొందుతోంది. ఈ నెల 18న సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

*న‌టీన‌టులు:* రామ్ కార్తీక్, కశ్వి, త‌దిత‌రులు

*సాంకేతిక వ‌ర్గం:* 

ఆర్ట్ - గాంధీ నడికుడికర్

ఎడిటర్ - జెస్విన్ ప్రభు

సినిమాటోగ్రఫీ - సాయిరామ్ ఉదయ్

మ్యూజిక్ డైరెక్టర్ - సమర్థ్ గొల్లపూడి

బ్యానర్ - పద్మనాభ సినీ ఆర్ట్స్

పీఆర్ఓ - సురేష్ కొండేటి

నిర్మాతలు - పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి

రచన, దర్శకత్వం - మనోజ్ పల్లేటి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.