ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏ బి డి ప్రొడక్షన్స్' సంస్థ నుండి విడుదల కానున్న రెండో సినిమా"గల్లీ గ్యాంగ్ స్టార్స్" - జూలై 26 న సినిమా విడుదల







'ఏ బి డి ప్రొడక్షన్స్'  సంస్థ నుండి విడుదల కానున్న రెండో సినిమా"గల్లీ గ్యాంగ్ స్టార్స్" - జూలై 26 న సినిమా విడుదల

'క్లూ', 'మంచి కాఫీ లాంటి కధ' లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో  నటించిన సంజయ్ శ్రీ రాజ్ (Sanjay Sree Raj)ను  హీరోగా పరిచయం చేస్తూ ప్రియ శ్రీనివాస్'హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సినిమా 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'.  'మే 16' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన సంస్థ 'ఏ బి డి ప్రొడక్షన్స్' మరో అడుగు ముందుకు వేస్తూ 'గల్లీ గ్యాంగ్ స్టార్స్' అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు 'ఆపిల్ మ్యూజిక్' 'స్పోటిఫై' 'అమెజాన్ మ్యూజిక్'  'రిసో ప్లేయర్' 'హుంగమ' 'జియో సావన్' 'గాన' 'యుట్యూబ్ మ్యూజిక్' తదితర మాధ్యమాలల్లో అందరిని అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని 'భోలో శంకరా' పాటకి విశేష ఆదరణ లభించింది.

దర్శకులు ధర్మ గారు మాట్లాడుతూ " 'గల్లి గ్యాంగ్ స్టార్స్' అనే సినిమాని నెల్లూరు లో షూట్ చెయ్యటం జరిగింది అని. ఈ సినిమా ఒక గల్లీ లో నివసించే అనాధలు వాళ్ళు ఎదురుకునే సంఘటనల సమూహం" అని వివరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్- డి ఐ- దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తో పాటు కధలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా  డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు ఏ ఈ కథకి కథ రచయత కూడా.

ప్రొడ్యూసర్ డా. ఆరవేటి యశోవర్ధన్ గారు మాట్లాడుతూ "ఈ సినిమా క్రైమ్ డ్రామా చుట్టూ జరుగుతుంది అని ఇందులో నాలుగు ముఖ్య పాత్రలు అనాధలు అని వాళ్ళ జీవితాలు ఎలా ఎవరి వల్ల మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అంటే సినిమా తప్పకుండా చూడాలని, మాస్ ప్రేక్షకులకి తప్పక నచ్చి తీరుతుంది" అని చెప్పుకొచ్చారు.

ప్రొడ్యూసర్, దర్శకులు ఇద్దరూ ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్న సినిమాని తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా జులై 26 న రిలీజ్ అవుతుంది అని తెలియచేశారు.

నటీనటులు :

సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ , రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి

టెక్నీషియన్స్ :

నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్

నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్

స్టొరీ మరియు దర్శకుడు: వెంకటేష్ కొండిపోగు, ధర్మ

డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ

సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి

పి ఆర్ ఓ: మధు VR

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...