ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

*కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి




      
*కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి      

*వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా  విఫలమైంది*

*10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది*

*వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలి*

*కేంద్రం తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి*

*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి*

వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు అని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందస్తుగా వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షలు చేయకుండా ప్రగతి భవన్ ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వ‌ర్షాల‌తో జ‌నం అత‌లాకుత‌లం అవుతుంటే ఒక‌రు ఫామ్ హౌస్ లో, మ‌రొక‌రు విందులు వినోదాల‌లో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి.
“రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది... సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం అన్న‌ది ఉందా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ భూమి మీద ఉన్నా లేన‌ట్టేన. అందుకే వారు లేర‌ని ఇప్ప‌టికే ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యార‌ని సోమవారం ఆ ఇద్ద‌రు తండ్రీ కొడుకుల‌కు త‌ద్దినం పెట్టాల‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌కు పిలుపునిస్తున్నా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారిందని ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయన్నారు.  ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20 వేలు అందించాలి అని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15 వేలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  
శనివారం నాడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉప్పల్, ఎల్బీ నగర్నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద ముప్పు పై సమీక్షలు చేయకుండా కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలమైతే పట్టించుకోకుండా తండ్రీ కొడుకులు ప్రజల ప్రాణాలు పూచీక పుల్లతో సమానం అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. 
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా  విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కు బాత్రూంలు కడగడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారు మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదు అని విమర్శించారు. హైదరాబాద్ నగరంపై కేటీఆర్ వి ఆర్భాటపు ప్రకటనలే తప్ప మరొకటి కాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరం పరిస్థితి మేడిపండు చందంగా మారిందన్నారు.  పాలకుల కక్కుర్తి వల్లే  కాలనీలు వరదల్లో మునిగిపోయాయని ఆరోపించారు. నిజాం కాలం నాటి చెరువులను 90 శాతం మంది బీఆరెస్ నేతలు ఆక్రమించుకున్నారు. చెరువుల ఆక్రమనలతో కాలనీలు వరదల్లో మునిగిపోయాయి అని ఆరోపించారు. కేటీఆర్ కు విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రియల్ ఎస్టేట్  కోసమే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆరెస్ లో చేరారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సుధీర్ రెడ్డి మూసి రివర్ ఫ్రంట్ ఆథారిటికి చైర్మన్ అయ్యి.. నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచారు అని ఆయన ఎద్దేవా చేశారు.
వరదలు, వర్షాలతో 30 మంది చనిపోయినా ఎందుకు పరామర్శించేందుకు లేదని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది. అందుకే ఈ ప్రభుత్వానికి వరద నీటిలో తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నా అన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్ కు బుద్ది రాలేదు అని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 
కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు వెయ్యి కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిగారిపై  ఉందన్నారు. ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి పరిస్థితిని కిషన్ రెడ్డి ప్రధానికి వివరించి వెంటనే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి పార్లమెంటులో అమిత్ షా ను కలిసి వరద నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

*ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి*

ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా రేవంత్ రెడ్డి పరిశీలించారు.  సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి లేకుంటే సోమవారం పార్లమెంటులో నితిన్ గడ్కరీకి నివేదిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యంపై అధికారులతో మాట్లాడారు. కారిడార్ పనులు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని ఈఈ, ఈఎన్సీ అధికారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎలివేటెడ్ పనుల సాగదీతతో స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.

*మమతా నగర్ నాలా పనుల పరిశీలన*

నాగోల్ మమతా నగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఆ కాలనీలో అసంపూర్తిగా ఉన్న నాలా పనులను పరిశీలించారు. నాలా పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తవ్వి వదిలేసిన నాలా ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ వాసులు ప్రమాదం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా నాలా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా  పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో ఇబ్బందులు పడుతున్నామని ఎల్బీ నగర్ సాగర్ రోడ్డులోని ఓంకార్ నగర్ కాలనీవాసులు రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు.

*కొల్లాపూర్ నాయకుల చేరికలు*

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోడేర్ మండలం బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.