ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు, తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..













 స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు,

 తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. 

తీవ్రభయాందోళనకు గురయిన పరిసర ప్రాంతాల ప్రజలు 

ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు

రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని ఓ మెడివేస్ట్ స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.మంటలు ఆర్పి స్క్రాప్ దుకాణం లో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది. గాయపడిన వారిలో అందరూ యువకులే. రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామా లను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.   

స్క్రాప్ దుకాణం ఎస్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాబుద్దీన్ గత కొన్నేళ్లుగా గగన్ పహడులో స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవల కొంతకాలంగా గడువుతీరిన మెడికల్ వేస్టేజ్ ను కొనుగోలు చేసి బాటిల్స్ ను వేరు చేస్తున్నాడు. గడువు తీరిన మందులను యదేచ్చగా పారబోస్తున్నాడు.

గత రాత్రి  మెడికల్ వేస్టేజ్ వద్ద మంటలు అంటుకొని అందులో ఉన్న సిలిండర్ కాస్త పేలిపోయింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రభయాందోళనకు లోనయ్యారు.

అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పీయడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. గోదాం లో ఉన్న మెడికల్ వేస్ట్ మంటల బారిన పడితే విషవాయులు వెలువడి పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవి.

జనావాసాల సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన ఇలాంటి గోదాములు ఏర్పాటు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్క్రాప్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.