ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అర్జున్ సురవరం చిత్రం మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది,


అర్జున్ సురవరం చిత్రం మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది, నవంవర్ 29న గ్రాండ్ రిలీజ్ - హీరో నిఖిల్

 

హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా 'అర్జున్ సురవరం'. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డిన ఈ చిత్రం చివరికి నవంబర్ 29 న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 

 

అర్జున్ సురవరం చిత్రం మేము ఎంతో శ్రమించి చేశాము. అన్యాయం ఎదిరించే ఒక రిపోటర్ పాత్రలో నేను నటించాను. చిత్ర నిర్మాణం సమయంలో నిర్మాతలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ సంతోష్ అద్భుతంగా ఈ సినిమా తీశాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో బాగా నటించింది, తన రోల్ అందరికి గుర్తుండిపోతుంది. సినిమాను థియేటర్ లొనే చూడండి, థియేటర్ లో చూస్తేనే ఈ సినిమా ఫీల్ తెలుస్తుంది, అందుచేతనే ట్రైలర్ కూడా థియేటర్ లొనే ప్లే చేశాము. నవంవర్ 29న వస్తున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి అన్నారు.

 

 

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ...

 

అర్జున్ సురవరం ట్రైలర్ ఇలా థియేటర్ లో ఆడియన్స్ మధ్య విడుదలవ్వడం థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది,మీ అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉండబోతోంది, ట్రైలర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ సినిమాను థియేటర్ కు వచ్చి చూడండి, నా పై మీ ప్రేమ ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్న అన్నారు.

 

డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ...

 

నిఖిల్ తో వర్క్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. సినిమా చిత్రీకరణ సందర్భంలో సహకరించిన అందరికి స్పెషల్ థాంక్స్. నిర్మాత ఠాగూర్ మధు గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మంచి మెసేజ్ తో పాటు కమర్సియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. నాకు, నిఖిల్ కు మా చిత్ర యూనిట్ సభ్యులకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను. నవంబర్ 29న విడుదల కాబోతున్న మా అర్జున్ సురవరం సినిమాను మీ అందరూ చూసి హిట్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.

 

న‌టీన‌టులు:

నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

 

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  టి.సంతోష్‌

స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు

బ్యాన‌ర్‌:  మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి

నిర్మాత‌:  రాజ్‌కుమార్ అకెళ్ల‌

సంగీతం:  సామ్ సి.ఎస్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సూర్య‌

ఎడిట‌ర్:  న‌వీన్ నూలి

పి.ఆర్‌.ఒ:  వంశీశేఖ‌ర్‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.