ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured Post

రివైండ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ - ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల*

 * రివైండ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ - ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల* సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ తుషార పాలా మాట్లాడుతూ : కళ్యాణ్ చక్రవర్తి సార్ ని 2 ఇయర్స్ ముందే కలిశాను. స్క్రీన్ ప్లే చెప్పినప్పుడే  చాలా నచ్చింది. కొత్త టీం గా అందరం వర్క్ నేర్చుకుంటూ కష్టపడి పని చేసాం. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులు అందుకే నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.  హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ : బిగ్ స్క్రీన్ మీద నాకు ఇది ఫస్ట్ సినిమా. నాకే కాదు మా డైరెక్టర్ గారు, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అందరి
ఇటీవలి పోస్ట్‌లు

హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం

  హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున ఉన్న లాయర్ నాగూర్ బాబు మరియు ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు అదే విధంగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసులు వివరాలను తెలియజేశారు. లాయర్ నాగూర్ బాబు గారు మాట్లాడుతూ : ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్లు కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయిన తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టాగ్రామ్ పేజెస్ ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాధితురాలు పైన లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మీడియా ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా వాటిని ఎంటర్టైన్ చేస్తూ బాధితురాలని ఇబ్బ

రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ*

 * రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ* శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్  అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ శింబు అందించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న రీ రిలీజ్ చేశారు. సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మధ్యకాలంలో రీ రిలీజులకు ఉన్న ట్రెండ్ ఏంటో మనందరం చూస్తున్నాం. ప్రస్తుత రిలీజ్ లకు దీటుగా రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఈనెల 5న రీ రిలీజ్ అయిన మన్మధ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. శింబు, జ్యోతిక క్రేజ్ మామూలుగా లేదు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. జనరేషన్ తో సంబంధం లేకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగ

ఘనంగా జరుపుకున్నాగ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024

   ఘనంగా జరుపుకున్నాగ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024  గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ అనేది దేశంలోని మరియు బహుశా ప్రపంచంలోని అన్ని మతాలు మరియు ఆధ్యాత్మికత ఆజ్ఞల కలయికలో ఒకటి, ఇది ప్రసిద్ధ ప్రపంచ మతాల పార్లమెంటు సమావేశం తర్వాత స్వామి వివేకానంద తన ప్రారంభ వ్యాఖ్యలతో చరిత్ర సృష్టించింది.  హార్ట్‌ఫుల్‌నెస్ నాలుగు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ఆధ్యాత్మిక నాయకులను మరియు 100,000 మంది పాల్గొనేవారికి ఆతిథ్యం ఇచ్చింది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ సమ్మిట్‌ను ఆమెతో పాటు గౌరవనీయులైన భారత ఉపాధ్యక్షుడు శ్రీ జగదీప్ ధంఖర్ కూడా శిఖరాగ్ర సమావేశం యొక్క 3 మరియు 4 రోజులను అలంకరించారు.    దృక్పథం మరియు హృదయపూర్వకత, అతని కరుణ, మరియు ధ్యానం అందరికీ అందుబాటులో మరియు ఉచితంగా చేయడం మరియు మానవాళిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల యొక్క వివిధ సుస్థిరత ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం ద్వారా, రెవ. దాజీ 'శాంతి నిర్మాణం మరియు కామన్వెల్త్‌లో విశ్వాసం యొక్క గ్లోబల్ అంబాసిడర్'గా గౌరవించబడ్డారు. సమ్మిట్ ముగింపు రోజున కామన్వెల్త్ సెక్రటేరియట్. Rt. గౌరవనీ

ఘనంగా జరుపుకున్నాగ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024

 ఘనంగా జరుపుకున్నాగ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024  గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ అనేది దేశంలోని మరియు బహుశా ప్రపంచంలోని అన్ని మతాలు మరియు ఆధ్యాత్మికత ఆజ్ఞల కలయికలో ఒకటి, ఇది ప్రసిద్ధ ప్రపంచ మతాల పార్లమెంటు సమావేశం తర్వాత స్వామి వివేకానంద తన ప్రారంభ వ్యాఖ్యలతో చరిత్ర సృష్టించింది.  హార్ట్‌ఫుల్‌నెస్ నాలుగు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ఆధ్యాత్మిక నాయకులను మరియు 100,000 మంది పాల్గొనేవారికి ఆతిథ్యం ఇచ్చింది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ సమ్మిట్‌ను ఆమెతో పాటు గౌరవనీయులైన భారత ఉపాధ్యక్షుడు శ్రీ జగదీప్ ధంఖర్ కూడా శిఖరాగ్ర సమావేశం యొక్క 3 మరియు 4 రోజులను అలంకరించారు.    దృక్పథం మరియు హృదయపూర్వకత, అతని కరుణ, మరియు ధ్యానం అందరికీ అందుబాటులో మరియు ఉచితంగా చేయడం మరియు మానవాళిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల యొక్క వివిధ సుస్థిరత ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం ద్వారా, రెవ. దాజీ 'శాంతి నిర్మాణం మరియు కామన్వెల్త్‌లో విశ్వాసం యొక్క గ్లోబల్ అంబాసిడర్'గా గౌరవించబడ్డారు. సమ్మిట్ ముగింపు రోజున కామన్వెల్త్ సెక్రటేరియట్. Rt. గౌరవనీయు

ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి ,అక్టోబర్ 4న …

ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి ,అక్టోబర్ 4న … తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు, ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఏమిటోచూద్దాం. తెలుగు సినిమా రంగానికి ఆయన ఓ ఆభరణం.. అలా శంకరశాస్త్రి దరిచేరి ‘శంకరాభరణ’మైంది. ‘స్వయంకృషి’తో హిట్టు కొట్టారు.. ‘సీతాకోక చిలుక’ను పట్టారు. ఎంతోమంది ‘సితార’లకు ‘అపద్బాంధవుడ’య్యారు. ఆ ‘స్వరకల్పన’ అనితర సాధ్యం.. ఆ ‘సిరిసిరి మువ్వల’ సవ్వడి అనన్యసామాన్యం. అందుకే సినిమా రంగానికి దొరికిన ‘స్వాతిముత్యం’ ఏడిద నాగేశ్వరరావు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అంటేనే ఓ స్వరఝరి.. ప్రత్యర్థులకు అలజడి. అక్టోబర్ 4న పూర్ణోదయా  మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు 9వ వర్ధంతి  సందర్భంగా ప్రత్యేక కథనమిది.  అనేక కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ఘనత ఆయనది. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన కాలక్రమేణా అభిరుచి గల నిర్మాతగా మారతారని ఎవరూ ఊహించలేదు. నాటకాల నుంచి సినిమాల వైపు తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరర

తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుంది

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, 02-10-2024 నాడు మీడియాలో తెలంగాణకు చెందిన ఒక గౌరవనీయ మహిళా మంత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల  వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన అభ్యంతరకరమైన, ధృవీకరించబడని మరియు వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల బాధ మరియు ఆవేదనను వ్యక్తం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, తెలుగు సినీ సెలబ్రిటీలు మరియు ఇతర తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సభ్యులు చాలా మందికి సులువైన టార్గెట్ గా మారారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని తెలియజేయుచున్నాము.   రాజకీయాలు మరియు చలనచిత్ర పరిశ్రమ సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ రంగాలు పరస్పర సహకారం మరియు గౌరవం అందిపుచ్చుకుంటూ సమాజంలో తమ బాధ్యతను గుర్తెరిగి ఉండడం చాలా కీలకం. రాజకీయ నాయకులు అపారమైన అధికారాన్ని కలిగి ఉంటారు మరియు సినిమాలు సాంస్కృతిక కథనాలను రూపొందిస్తాయన్నది వాస్తవం. ఈ రకమైన సంఘ