ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured Post

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు ఘన సన్మానం*

 * ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు ఘన సన్మానం* హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ  తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్,  ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి ఘన సన్మానం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె. వేంకటేశ్వరరావు, ఎఫ్ఎన్ సీసీ గత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా *ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు...
ఇటీవలి పోస్ట్‌లు

వేసవి కానుకగా ఏప్రిల్ 25న "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌

  వేసవి కానుకగా ఏప్రిల్ 25న "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌  బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "ఎర్రచీర - ది బిగినింగ్" చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.   ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం మొదట శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్‌లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.   ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్ వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని, కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా అని అన్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ ...

ఘనంగా ఆర్జీవీ 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

  ఘనంగా ఆర్జీవీ 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కొత్త సినిమా 'శారీ'. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ - 'శారీ' సినిమాకు టాలెంటెడ్ న్యూ టీమ్ వర్క్ చేసింది. మా అందరితో మూవీకి కావాల్సినట్లు వర్క్ చేయించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమాకు కావాల్సిన కంటెంట్ మా ద్వారా తీసుకున్నారు. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో సినిమా ఎలా చేయాలి అనేది ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. రెండు పాత్రలతోనే ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇది. ఆ రెండు క్యారెక్టర్స్ లో ...

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

  మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం  ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్టర్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  పూజా కార్యక్రమంలో ... దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ..‘‘2012లో నా జర్నీ మొదలైంది...

మనంసైతం' ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

 ' మనంసైతం' ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం   హైద‌రాబాద్: 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్ వారి స‌హ‌కారంతో 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ వ్యవస్థాపకులు కాదంబ‌రి కిర‌ణ్ నిర్వ‌హించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా  'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ''ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవ‌రికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ పండ‌గ రోజున ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల డాక్ట‌ర్ల‌తో క‌లిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వ‌హించాము. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్రామానికి శ్రీకారం చుట్టాము. గత 10 సంవ‌త్స‌రాలలో  50 వేల మంది నిస్సాహ‌యుల‌కు మా ఫౌండేషన్...

ఆకట్టుకుంటున్న ఓరి పిల్లడా సాంగ్

  ఆకట్టుకుంటున్న ఓరి పిల్లడా సాంగ్  తెలుగు సినీ, మ్యూజిక్ లవర్స్ టేస్ట్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్ కే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఈ మద్య కంపోజర్స్ అందరూ ఫోక్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన మ్యూజిషియన్స్ మాస్ మసాలా బీట్స్ మీద బాగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆడియన్స్ లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా వెంకీ రొంపెల్లి నాయకుడిగా శిల్పా యాదవ్ నాయికగా ఓరి పిల్లడా అంటూ సాగుతున్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. జేహెచ్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నోమిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సాంగ్ ని గాయత్రి ఆలపించారు. అర్మాన్ మెరుగు లిరిక్స్ అందించడంతో పాటు సంగీతం అందించిన ఈ సాంగ్ కి కమ్లీ పటేల్ కెమెరా హ్యాండిల్ చేయగా నమృత్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సాంగ్ ఆద్యంతం శ్రోతలను మాత్రమే కాదు వీక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.. బోడుప్పల్ పిల్ల యూట్యూబ్ ఛానల్ లో ర...

లవ్ యువర్ ఫాదర్ ఫస్ట్ టికెట్ కొన్న కిషన్ రెడ్డి! ఏప్రిల్ 4 న విడుదల*

 * లవ్ యువర్ ఫాదర్ ఫస్ట్ టికెట్ కొన్న కిషన్ రెడ్డి! ఏప్రిల్ 4 న విడుదల* తాజాగా విడుదలైన "LYF - Love Your Father" మూవీ ట్రైలర్ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. చూస్తుంటే తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. SP చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి. ఏప్రిల్ 4న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబట్టిన LYF ట్రైలర్ రాజకీయ నాయకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా LYF సినిమా ట్రైలర్ ని ఫేమస్ పొలిటికల్ లీడర్, BJP నేత అయిన శ్రీ కిషన్ రెడ్డి గారు చూడటం జరిగింది. ఈ ట్రైలర్ ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. మూవీ టీం మొత్తాన్ని అభినందించారు. ట్రైలర్ చాలా బాగుందని ముఖ్యంగా అందులోని కాశీ విజువల్స్ తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ట్రైలర్ వీక్షించిన కిషన్ రెడ్డి గారు కచ్చితంగా ఈ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్ల...