* ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు ఘన సన్మానం* హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె. వేంకటేశ్వరరావు, ఎఫ్ఎన్ సీసీ గత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా *ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు...
వేసవి కానుకగా ఏప్రిల్ 25న "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "ఎర్రచీర - ది బిగినింగ్" చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం మొదట శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్ వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని, కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ ...