ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured Post

మే 2వ వారంలో ఎర్రచీర.. పట్టుకుంటే ఐదు లక్షలు

మే 2వ వారంలో ఎర్రచీర.. పట్టుకుంటే ఐదు లక్షలు    ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'ఎర్రచీర'. 'ది బిగినింగ్' అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 25 ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను వేసవి కానుకగా మే రెండో వారంలో  విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘’ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్  కొట్టకుండా సిద్ధం చేసుకున్నాం. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్తారు అని చెప్పగలను. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారు. ...
ఇటీవలి పోస్ట్‌లు

సూర్యాపేట జంక్షన్' సినిమా రివ్యూ*

సూర్యాపేట జంక్షన్' సినిమా రివ్యూ*   'సూర్యాపేట జంక్షన్' మూవీ పొలిటికల్ కామెడీ డ్రామా. ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ రోజు (శుక్ర‌వారం) విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. *కథ:* స్టూడెంట్ అర్జున్‌ (ఈశ్వర్) తన నలుగురు స్నేహితులతో కలిసి జాలిగా తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. ఈ క్రమంలో జ్యోతి (నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే కావాలనుకుంటూ, పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రను అమలు చేస్తాడు. కానీ, అర్జున్‌ గ్యాంగ్‌లో ఒకరైన శీను అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఆ ఘటన వెనక ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? ఉచిత పథకాల వెనుక ఉన్న అసలు మురికి ఏంటి? అనే ప్రశ్నలకు సినిమా మెల్లగా సమాధానాలు ఇస్తూ, ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.  *నటీనటులు:* - *ఈశ్వర్* అర్జున్ పాత్రలో...

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

  హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్  !!! ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ అనే సినిమా తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుకుమార్.పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి ఈ సినిమాకు ఎడిటర్. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: ఆద్య ( కావ్య కీర్తి ) సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది బెంగళూరులో ... ఇంట్లో ఒక్కతే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ చేయడం అమ్మతో ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది... ఇంతలో ఆద్య కాలేజీ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేస్తాడు.. అప్పటి నుండి ఆద్య కి ప్రాబ్లెమ్ స్టార్ట్ అవుతాయి... ఇంట్లో ఆద్య ఏం చేస్తుందో ఏ డ్రెస్ లో ఉందో అన్ని చెప్పి ఆద్య నీ భయపెడుతూ ఉంటాడు... జాబ్ ప్రాబ్లెమ్ ఫ్రెండ్ కి ప్రాబ్లమ్స్ ఆద్య మదర్ కి ప్రాబ్లెమ్ వోచేలా చేస్తాడు రాహుల్... అసలు రాహుల్ ఎం...

ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించిన‌ హీరో కృష్ణ‌సాయి

  ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించిన‌ హీరో కృష్ణ‌సాయి జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై కృష్ణసాయి ఇంట‌ర్నేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్టు నిర్వ‌హ‌కులు, టాలీవుడ్ హీరో కృష్ణ‌సాయి చ‌లించిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా ఖండించారు. ''అత్యంత క్రూరంగా వెంటాడి చంపారు. ఇండియ‌న్ పార‌మిట‌రీ ఫోర్స్ ఏదో సైలెంట్‌గా ఉంద‌ని ఉగ్ర‌వాదులు అనుకుంటే పొర‌పాటే, భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ గారు చెప్పిన‌ట్టు ప్ర‌పంచం ఆశ్చ‌ర‌పోయేలా భారత్‌ గట్టిబదులిస్తుంది. వారిని వెంటాడి ప్ర‌తీకార చ‌ర్య ఉంటుంది. శాంతి కోరుకునే దేశాన్ని స‌హ‌నం ప‌రీక్షించేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా దేశ‌మంతా ఒక్క‌టిగా నిల‌వాలి'' అని పిలుపునిచ్చారు. పహల్గామ్‌ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది

*ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల‌*

 * ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల‌* హైద‌రాబాద్:  తెలుగు వెండితెర‌పై మ‌రో భ‌క్తిర‌స చిత్రం క‌నువిందు చేయ‌బోతోంది. అనంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో, నర్సింగ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం "శివ శంభో". తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్, ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ డా. త‌నికెళ్ల భ‌ర‌ణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు. ఇలా...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...

చంద్రబాబు పుట్టినరోజు సంబర్భంగా తిరుమలలో 750 కొబ్బరి కాయలు కొట్టి 7 కేజిల కర్పూరం వెలిగించిన టీడీపీ శ్రేణులు!

  చంద్రబాబు పుట్టినరోజు సంబర్భంగా తిరుమలలో 750 కొబ్బరి కాయలు కొట్టి 7 కేజిల కర్పూరం వెలిగించిన టీడీపీ శ్రేణులు! ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ. చంద్రబాబు 75 వ జన్మదినం సందర్బంగా 750 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు., 7 కేజీల ఐదువందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు. తమ అభిమాన నేత దీర్ఘాయిస్సు, టీడీపీ అధికారంలోకి వచ్చేలా చూడు గోవింద అంటూ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో కొబ్బరి కాయలు కొట్టమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న చంద్రబాబుకు ఆయురారోగ్యాలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.ప్రజా శ్రేయస్సు కోరారు సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయం కావాలని ఆకాంక్షించారు. 75వ జన్మదినం సందర్బంగా 750 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు., 7 కేజీల ఐదు వందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించామన్నారు...