ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured Post

ఘనంగా ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక, ఈ జంట కలిసి చేసిన మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ లాంఛ్.*

 * ఘనంగా ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక, ఈ జంట కలిసి చేసిన మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ లాంఛ్.* ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖల నటులు సాయికుమార్, యువ హీరో సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ తో పాటు  పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంగేజ్ మెంట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.  ఈ నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభశ్రీ కలిసి చేసిన మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను లాంఛ్ చేశారు. సాయి కుమార్ వాయిస్ తో ఈ పాట ప్రారంభం కావడం ఆకర్షణగా నిలిచింది. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపర్చి సింగర్ సాహితీ చాగంటితో కలిసి పాడారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే వీరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నారు. జూలైలో అజయ్ మైసూర్, శుభశ్రీ  వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది. ఎంగేజ్ మెంట్ కార్యక్రమంలో సాయికుమార్ మాట్లాడుతూ.. అజయ్ మైసూర్ నాకు మంచి మిత్...
ఇటీవలి పోస్ట్‌లు

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుంది. గతంలో 'ఆకాశ వీధుల్లో' చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి  హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాల...

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "బ్యాచిలర్స్ ప్రేమకథలు"

  పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  "బ్యాచిలర్స్ ప్రేమకథలు" యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ  నటీ నటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో  వస్తున్న చిత్రం "బ్యాచిలర్స్ ప్రేమ కథలు". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర  కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో  చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను తీసిన "కాలం రాసిన కథలు" సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్ గా "బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను" ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను.అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను  ఇండస్ట్రీకి  పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని 2025 లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్న...

తెలుగు సినిమాలకు ఆయా సంబంధిత విభాగాలలో 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం

  తెలుగు సినిమాలకు ఆయా సంబంధిత  విభాగాలలో 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం చేస్తోంది.  మరియు, ఈ క్రింద ఉదహరించిన ప్రత్యేక ఆవార్డుల కొరకు ( ఒక్కొక్కరికి రూ. 10.00 లక్షల నగదు బహుమతితో పాటు జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రం) శ్రీ మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినందుకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి , గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి,  రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి,  శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్రాజు) గారికి, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్,  డాక్టర్ ఎస్. హరీష్, (IAS) గారికి  తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.   ఈ ప్రత్యేక ఆవార్డుల విషయంలో  (1) ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు కొరకు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు కొరకు శ్రీ మణిరత్నం గారు  (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు కొరకు శ్రీ సుకుమార్ గార...

అత్యంత వైభవంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం.

  అత్యంత వైభవంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం. స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి ని పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో జరిగిన సి బి జె కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో  అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నిర్మాత శ్రీ ఆర్వీ రమణమూర్తి గారి ఆశయ సాధన అహర్నిశలు శ్రమిస్తున్న భువన రాయవరపు సారధ్యంలో  స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ప్రత్యేకంగా రియల్ హీరోస్ ని సత్కరించే ఎన్టీఆర్ దేశ్ రక్షక్ అవార్డులను త్రివిధ దళాలకు చెందిన సైనిక అధికారులకు అందజేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన సైనిక అధికారులకు పురస్కారాల ప్రధానం  జరిగింది. మేజర్ జనరల్ ఎన్ ఎస్ రావు, మేజర్ భరత్, గ్రూప్ కెప్టెన్ పి ఆర్ ప్రసాద్, కెప్టెన్ టి ఎన్ సాయికుమార్ లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ దేశ రక్షక్ అవార్డులను విశిష్ట అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే కళావేదిక సంస్థ అందిస్తున్న ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల...

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి 'ఆపరేషన్ సింధూర్' సాంగ్ లాంచ్

 దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి 'ఆపరేషన్ సింధూర్' సాంగ్ లాంచ్ దేశం మీద ప్రేమ కలిగి ఉండటం ఒక వంతు అయితే ఆ ప్రేమను ప్రజలందరికీ ఉపయోగపడేలా ఏదో ఒక రూపంలో బయట పెట్టడం సామాన్య విషయం కాదు. ఇటీవల కాలంలో మన దేశ పౌరులపై జరిగిన దాడికి సమానంగా మన దేశ జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై చేసిన ఆపరేషన్ సింధూర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి గారు ఓ పాట రూపంలో తన దేశభక్తిని చూపారు. ప్రసాద్ రచించిన ఈ పాటకు రమేష్ సంగీతాన్ని అందించగా కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు మనికంట ఎడిటింగ్ చేయగా సత్య శ్రీనివాస్ గారు సంగీత సహకారాన్ని అందించారు. లక్ష్మణ్ పూడి గారు ఈ పాటకు స్వరాన్ని జోడించి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి జెడి లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... "మిత్రుడు లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్ పై మన దేశ జవానుల గురించి పాట పాడటం, ఆ పాట లాంచ్ కా...

హైదారాబాద్ దేశంలోనే నివాసయోగ్యమైన అతి పెద్ద నగరం

  హైదారాబాద్ దేశంలోనే నివాసయోగ్యమైన అతి పెద్ద నగరం  దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇతర దేశాల నుండి కూడా హైదారాబాద్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు నివాసముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాముఖ్యత చెందిన మహా నగరం  ఇక్కడి వాతావరణం అందరినీ ఎంతగా  ఆకట్టుకుందో విస్తరించిన నగరం హద్దులు చెపుతాయి గత మూడు దశాబ్దాలుగా హైదారాబాద్ నగరం నివాసాలకు విస్తరణ తీరు ఒక సారి గమనిద్దాం కూకట్ పల్లి - హైటెక్ సిటీ - మాదాపూర్ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ - నానక్ రామ గూడ - నార్సింగి - కోకాపేట - జన్వాడ - మోఖిల - శంకర్ పల్లిలతో పాటు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఒక వైపు విస్తరించాయి కొండాపూర్ - లింగంపల్లి - హఫీజ్ పేట్ - మియాపూర్ - బి హెచ్ ఈ ఎల్ - రామచంద్రాపురం - పఠాన్ చెరువు మరో వైపు విస్తరించాయి పఠాన్ చెరువులో నిర్మాణాలు మొదలైన తరువాత అంతర్భాగమైన కొల్లూరు, ముత్తంగి, తెల్లాపూర్ ,పాటి, కర్ధనూర్  లాంటి ప్రదేశాలు శరవేగంగా అభివృద్ధి చెందటమే కాకుండా భూమి ధరలు అందనంత పెరిగాయి ఒక సారి నిశితంగా గమనిస్తే ఔటర్ రింగ్ రోడ్డు - ముంబై హైవేల ప్రాంతాలు  పఠాన్ చెరువు నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి...